🚨 “అమరావతి బిల్లు… రైతులకు నైతిక హామీ!”

అమరావతికి చట్టబద్ధత కల్పించే బిల్లు కేవలం చట్టం మాత్రమే కాదని టీడీపీ ఎంపీ బీద మస్తాన్‌రావు అన్నారు.

ఇది రైతుల త్యాగాలకు ఇచ్చే నైతిక వాగ్దానం అని స్పష్టం చేశారు. 💬

అమరావతి… ఆంధ్రుల ఆత్మగౌరవానికి ప్రతీక అని పేర్కొన్నారు.
రాజధాని కోసం పోరాడిన రైతులపై వేల కేసులు పెట్టిన విషయాన్ని గుర్తు చేశారు.

ప్రస్తుతం సీఎం చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి దిశగా పయనిస్తోందన్నారు.